సిరుగుప్ప క్రాస్ నందు రోడ్డు మరమ్మతులు సొంత నిధులతో చేపట్టిన ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రమేష్
9TV news Adoni 9014486864 9TV news Adoni 9014486864
16.5K subscribers
1,938 views
46

 Published On Sep 20, 2024

ఆదోని నియోజకవర్గంలో గత పాలకల నిర్లక్ష్యం కారణంగా దుర్భరమైన రోడ్లు దర్శనమిస్తున్నాయని కారణంగా ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్ యాదవ్ శుక్రవారం గుంతల పూడిక కార్యక్రమం చేపట్టారు. ఆదోని నియోజకవర్గం గ్రామాల్లో మరియు పట్టణంలో దుర్భరమైన రోడ్లు దర్శనమిస్తున్నాయని గత వైసిపి హాయంలో ఒక్క రోడ్డు కూడ వేసిన దాఖలు లేవని అయితే కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ అదిగో ఇదిగో అంటూ సొళ్ళు స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కబుర్లు చెబుతున్నారె తప్పా ప్రజల కష్టాలను, వారి సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కుమ్ములాడలే తప్ప అభివృద్ధి కనిపించడం లేదని గురువారం జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో కూటమి వ్యవహారం ప్రజలకు తెలిసిపోయిందని ఏమాత్రం ప్రోటోకాల్ లేకుండా ఎవరికి వారే యమునా తీరన్నట్టు చేసుకున్నారని అయితే ఎన్నికల ముందు ప్రజా సమస్యల కోసం కలిసి పని చేస్తామన్న కూటమి నాయకులు నేడు వేరువేరు కుంపట్లు పెట్టుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరఫున నిలబడి పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

show more

Share/Embed