Published On Jun 11, 2022
ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల వెంబడి పలు ప్రాంతాల్లో ఇటీవల పులి జాడలు స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పులి పలు జీవులను వేటాడడంతో సమీప పల్లెల్లో కలకలం కనిపిస్తోంది. రాత్రి వేళల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పులి సమాచారం తెలిసిన నాటి నుంచి దాదాపు 15 రోజులుగా కాకినాడ జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ కొనసాగుతోంది. వివిధ ప్రయత్నాలు చేసినా పులి పట్టుబడడం లేదు. రాయల్ బెంగార్ టైగర్గా అధికారులు దీనిని నిర్ధరించారు.
#Kakinada #RoyalBengalTiger #Tiger
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
show more